బంగారం కొనాలనుకున్న వారికి గుడ్ న్యూస్.గత పది రోజుల నుండి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం వెండి ధరలు గత రెండు మూడు రోజుల నుంచి క్షీణిస్తూ వస్తున్నాయి.
అంతర్జాతీయంగా ఉన్నట్టుండి గత రెండు రోజుల నుంచి భారీగా పడిపోతున్నాయి.నేడు మల్టీ కమిడీటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1500 పైగా తగ్గి రూ.50,490 వద్ద కొనసాగుతోంది.ఇక అక్టోబర్ లో ఫీచర్స్ ధర చూస్తే.వెండి కిలో ఏకంగా రూ.4830 గా తగ్గి రూ.62 వేలకు చేరుకుంది.క్రితం రోజు కూడా బంగారం ధర ఏకంగా 3 వేలకు పైగా పతనమైంది.దీంతో రూ.51,929 కి చేరుకుంది.మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి ఫీచర్స్ లో కూడా 6 శాతం వరకు బంగారం ధర తగ్గింది.
ఇక వెండి అయితే ఏకంగా 12 శాతం వరకు నష్టపోయింది.
ఇక తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 41 డాలర్లు నష్టపోయి 1905 డాలర్లకు చేరుకుంది.
ఇక నేటి మార్కెట్లో 18 డాలర్స్ నష్టపోయి 1894 డాలర్లకు చేరుకుంది.అలాగే వెండి ఔన్స్ ధర 7 శాతం పైగా నష్టపోయి 24 డాలర్లకు చేరుకుంది.
గత నెల రోజుల నుండి ఈరోజు నష్టపోకుండా పెరుగుతూనే వెళ్తున్న బంగారు వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేకులు పడుతూ, కాస్త ధరల వేగానికి నియంత్రణ పడినట్లయింది.గత మూడు వారాలలో పసిడి ధర ఏకంగా 14 శాతం పెరిగాయి.
ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, రిటైల్ మార్కెట్లో మాత్రం పెద్దగా కస్టమర్ల నుండి కొనుగోళ్లు చేయడం లేదు.దీంతో రిటైల్ బజార్లు కస్టమర్ లేక ఇబ్బందులు పడుతున్నాయి.
ఇక నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు చూస్తే… 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరిగి రూ.54,400 గా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.20 పెరిగి రూ.53,400 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది.ఇక కిలో వెండి విషయానికి వస్తే రూ.50 పెరిగి రూ.72, 550 కు వద్ద ట్రేడ్ కొనసాగుతుంది.