ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రైతులకు శుభవార్తను అందించింది.
ఏకంగా వ్యవసాయ పరికరాలపై భారీ తగ్గింపుతో రాయితీ ప్రకటించింది.గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పరికరాల పంపిణీలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త విధానాలను తీసుకొస్తోంది.
వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు అందజేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడానికి సంఘాలు 10 శాతం వరకూ నిధులు సమకూర్చుకున్నట్లయితే.
బ్యాంకులు 50శాతం రుణ సదుపాయం అందిస్తుంది.మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను శుక్రవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
పథకానికి దరఖాస్తు ఈ నెల 15లోగా చేసుకోవచ్చు.
గ్రామాల్లో సంఘాలుగా ఏర్పడాలని, కేవలం గ్రామానికి ఒకే సంఘానికి రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం కనిష్టంగా రూ.12 లక్షల నుంచి 15 లక్షలు, గరిష్టంగా రూ.1.20కోట్ల నుంచి రూ.1.30కోట్లను మంజూరు చేయనుంది.పరికరాల ఎంపిక ప్రక్రియ వచ్చేనెలలో చివరివారం ప్రదర్శనలు నిర్వహిస్తారు.
రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.