కువైట్ దేశానికి వివిధ దేశాలనుంచే ఎంతో మంది వలసలు వెళ్తూ ఉంటారు.వారిలో అధిక శాతం మంది కార్మికులుగా, పలు రంగాలలో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.
అయితే కరోనా నేపధ్యంలో ఎంతో మంది ప్రవాసులు కువైట్ విడిచి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు.అలా వెళ్ళిన వారిలో చాలామంది కువైట్ ఇచ్చే రెసిడెన్సీ ను రెన్యువల్ చేయడం మరిచిపోవడమే లేదంటే ఏ ఇతరాత్రా కారణాల దృష్ట్యా రెన్యువల్ చేయకపోవడమో జరిగింది.
ఈ నేపధ్యంలో రెసిడెన్సీ రెన్యువల్ చేయని వారికి రెండవ సారి అవకాశం ఇచ్చిది అక్కడి ప్రభుత్వం.
అయితే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోనటువంటి ప్రవాసులు ఉండటంతో మరొక్క సారి రెసిడెన్సి రెన్యువల్ కు అవకాశం ఇచ్చారు కువైట్ దేశపు అంతర్గతపు వవహారాల మంత్రి షేక్ దామోర్ అల్ అలీ.
గడువు ముగిసినా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారు లేదంటే గడువు ముగిసినా తమ దేశాలలో ఉంటున్న ప్రవాసులు తప్పకుండా ఈ నెల 15 (ఏప్రియల్ 15) తో ముగిసిన తేదీని మే నెల 15 వరకూ పెంచుతున్నట్టుగా ప్రకటించారు.అంతేకాదు అల్ అలీ మరొక ప్రకటన కూడా చేశారు.
మే 15 వరకూ సమయాన్ని ఇచ్చాము ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా తమ చట్టాలను ఉల్లంఘిస్తూ రెసిడెన్సీ రెన్యువల్ చేసుకొని వారిపై కటినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.అలాంటి వారిపై దేశం నుంచీ బహిష్కరణ, వారి పర్మిట్లు రద్దు చేయడం, భారీ జరిమానా తో పాటు ఎప్పటికి కువైట్ లోకి అనుమతించకుండా చేస్తామని తెలిపారు.
ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే రెసిడెన్సీ అయిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని కోరారు.