ఐపీఎల్ 14వ సీజన్ తుది పోరులో కోల్కతా నైట్రైడర్స్ను చిత్తు చిత్తుగా ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కప్ను ముద్దాడింది.చెన్నై జట్టుకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే అతడి సారథ్యంలో సీఎస్కే నాలుగో సారి టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం.నిజానికి ఐపీఎల్ సీజన్ తొలిదశలో ధోనీపై అనేక విమర్శలు వచ్చాయి.
అతడు సరిగా ఆడడం లేదు అంటూ అభిమానులు సైతం తీవ్ర స్థాయిలో చివాట్లు పెట్టారు.కానీ ధోనీ మళ్ళీ హార్డ్ వర్క్ చేసి కుర్రాళ్లతో పోటీగా ఆడి తన సత్తా ఏంటో చూపించారు.
దీంతో నాడు మహీని తిట్టిన నోళ్లే నేడు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి.చాలామంది వీరాభిమానులు ధోనీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంతోషకరమైన సమయంలోనే అభిమానులకు మరో అదిరిపోయే శుభవార్త అందింది.ధోనీ మళ్లీ తండ్రి కాబోతున్నారని సురేష్ రైనా సతీమణి ప్రియాంక చౌదరి వెల్లడించారని తెలిసింది.ధోనీ భార్య సాక్షి సింగ్ రావత్ ప్రస్తుతం గర్భం దాల్చారని ప్రియాంక తెలిపినట్టు సమాచారం.ఆమె నాలుగు నెలల గర్భం తో ఉన్నారని ప్రియాంక చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ధోనీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ధోనీ, సాక్షి జంట 2010లో పెళ్లి చేసుకోగా వీరికి 2015లో జీవా సింగ్ పుట్టింది.
జీవా అంటే ఎంతో ఇష్టం ఉన్న ధోనీ సమయం దొరికినప్పుడల్లా తన గారాలపట్టితో ఆడుకుంటుంటారు.వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సాక్షి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు.
అయితే ధోనీ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై విజయం సాధించిన అనంతరం సాక్షి తన కూతురు జీవాతో కలిసి ధోనీ వద్దకు వచ్చారు.ఆ సమయంలో ధోనీ తన భార్యా బిడ్డలను ఆప్యాయంగా కౌగలించుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.