క్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్..!!

ప్రపంచంలోకి మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటినుండి అనేక పరిస్థితులు తలకిందులైన సంగతి తెలిసిందే.ఈ వైరస్ దెబ్బకి చాలా చోట్ల ప్రజలంతా గుమిగూడే పరిస్థితులు లేవన్న సంగతి తెలిసిందే.

 Good News For Cricket Lovers, Corona Virus, Corona Vaccine, Bcci, England, India-TeluguStop.com

చాలా ప్రభుత్వాలు ప్రార్థనా స్థలాలు అదేవిధంగా మరికొన్ని చోట్ల వైరస్ ఎఫెక్ట్ వల్ల ఆంక్షలు విధించడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా వరకు దేశాలలో కరోనా టీకా అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా కరోనా ఆంక్షలు తొలగిస్తూ ఉన్నారు.

 తాజాగా భారతదేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కరోనా నిబంధనలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో భారత ప్రజలు ఎక్కువగా ఎంజాయ్ చేసే క్రీడ క్రికెట్ విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మేటర్ లోకి వెళ్తే కరోనా నేపథ్యంలో అప్పట్లో మైదానంలో ఉండి లైవ్ లో క్రికెట్ చూడటానికి అవకాశాలు లేకుండా బిసిసిఐ నిర్ణయం తీసుకోవడం అందరికీ తెలిసిందే.

ఈ నిర్ణయంతో మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లు నేరుగా చూడలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే తాజాగా దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.బీసీసీఐ మైదానంలో 50 శాతం ఆడియన్స్ మ్యాచులు తిలకించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ – ఇండియా సిరీస్ కోసం బీసీసీఐ మైదానం లో టికెట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube