టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
ఓ సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు ఓకే చెబుతున్నాడు బాలయ్య.ఇక బాలయ్య కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య ఫాన్స్ కి మరో శుభవార్త అందింది.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది.
ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.ఇందులో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.ఈ సినిమా పక్క మాస్ తో పాటు పవర్ ఫుల్ డైలాగులు, యాక్షన్ వంటివి ఎక్కువగా ఉంటాయని అనిల్ రావిపూడి వివరించాడు.ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కథను రాస్తున్నాడట.పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా తెరకెక్కనుందట.
అంతేకాకుండా ప్రముఖ సితార నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.యాక్షన్ తో పాటు ఎమోషనల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది.
ఇక ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోగా ఒకవేళ ఈ సినిమా ఉన్నట్లయితే బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.