ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు రాష్ట్రంలో గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఏపీలో అతి త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లను అధికారులు విడుదల చేయనున్నారు.కాగా సుమారు వెయ్యికి పైగా పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.