యూజర్స్ను మరింత ఆకర్షించేందుకు అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఆప్షన్ను తీసుకొచ్చింది.మత్లీ ప్రైమ్ మెంబర్ షిప్, సబ్స్క్రిప్షన్ సేవలను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొత్తగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకునే వారికి ఇది మంచి చాన్స్.మెంబర్ షిప్ను రద్దు చేసుకునే ఆప్షన్ ను సైతం తీసుకొచ్చింది.
నెలరోజుల పాటు ప్రైమ్ మెంబర్షిప్ సర్వీసును ఉపయోగించుకుని తర్వాత నచ్చకుంటే మెంబర్షిప్ను రద్దు చేసుకోవచ్చు.అమెజాన్ ఇయర్లీ ప్రైమ్ చార్జీలు రూ.999.త్రీ మంత్స్ ప్లాన్ రేటు రూ.329 ఉండగా దానికి రూ.387 గా మార్చారు.నెలవీరీగా ప్లాన్ తీసుకునే వారికి రూ.129 మాత్రమే.సెలక్ట్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
మొదటగా మంత్లీ సబ్ స్క్రిప్షన్స్ ఉన్నా.
ఈ సంవత్సరం మొదట్లో వాటిని అమెజాన్ రద్దు చేసింది.కేవలం త్రీ మంత్స్, ఇయర్ ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉంచింది.
నెట్ఫ్లిక్స్ సైతం మొదట్లో ఒకనెల ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇచ్చేది.తర్వాత దానిని తీసేసింది.
దీంతో అమెజాన్ సైతం నెట్ ఫ్లిక్స్ మాదిరిగానే ఫ్రీ సబ్ స్క్రిప్షన్ను తీసివేసింది.తర్వాత వినియోగదారుల కోసం తిరిగి దీనిని తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో దసరా పండుగను దృష్టితో పెట్టుకుని గ్రేట్ఇండియా ఫెస్టివల్సేల్ ప్రకటించి వినియోగదారులను ఆకర్షించింది.త్వరలోనే దీపావళి పండగ సందర్భంగా సైతం సేల్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో యూజర్స్ను మరింత ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.‘అడ్వాన్ టేజ్ జస్టు ఫర్ ప్రైమ్’ పేరుతో కొత్తగా ఓ ప్రోగ్రామ్ను రిలీజ్ చేసింది.దీని ద్వారా ఫెస్టివల్ సేల్లో ప్రైమ్ మెంబర్స్కు చార్జీలు లేకుండా (నో కాస్ట్) ఈఎంఐలను అందించింది.ఇది కేవలం స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైంది.
మరి దీపావళి ఫెస్టివల్కు ఎలాంటి ఆఫర్స్ తీసుకువస్తుందో చూడాలి.