కీర్తి సురేష్ హీరోయిన్ గా జగపతి బాబు మరియు ఆది పినిశెట్టిలు కీలక పాత్ర లో నటించిన గుడ్ లక్ సఖి సినిమా విడుదల కు సిద్దం అయ్యింది.ఈ వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నేడు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి హాజరు అయ్యేందుకు ఓకే చెప్పారు.నేడు చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అవ్వాల్సి ఉండగా ఆయన నిన్న కరోనా బారిన పడ్డట్లుగా పేర్కొన్నాడు.
తాను కరోనా తో బాధ పడుతున్నట్లుగా ప్రకటించిన చిరంజీవి ఇప్పుడు కొన్నాళ్ల పాటు ఎలాంటి షో కు వెళ్ల కూడదు అని నిర్ణయించుకున్నారు.దాంతో గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ అంటూ వార్తలు వచ్చాయి.
కాని తాజా గా రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరు అయ్యేందుకు ఓకే చెప్పాడు.
కరోనా వల్ల గుడ్ లక్ సఖి సినిమా చాలా ఆలస్యం అవుతూ వచ్చింది.ఇప్పుడు చిరంజీవి హాజరు అవ్వాల్సి ఉన్నా కూడా లక్ కలిసి రాకపోవడం తో చిరంజీవి కి కరోనా కాటు వేసింది.ఆయన రాలేక పోయాడు.
అయితే గుడ్డి లో మెల్ల అన్నట్లుగా చిరంజీవి కాకుండా ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు అయ్యేందుకు ఓకే చెప్పడం తో సినిమా మళ్లీ చర్చ ల్లో నిలిచింది.రామ్ చరణ్ ముఖ్య అతిథి గా హాజరు అవ్వడం వల్ల సినిమా స్థాయి మళ్లీ పెరిగినట్లుగా అయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా లో కీర్తి సురేష్ అర్చరీ క్రీడాకారిణి గా కనిపించబోతుంది.జగపతి బాబు ఆమె కోచ్ గా కనిపించబోతున్నాడు.