ఈ కలియుగంలో వింతగా ఏది జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అని వార్తలు వస్తుంటాయి.ఇంకా అలానే ఈసారి బ్రహ్మం గారు చెప్పినట్టే మరో వింత జరిగింది.
అదే బంగారు తాబేలు జననం.నిజానికి కరోనా వైరస్ పుడుతుందని, దాని వల్ల కోటిమంది మరణిస్తారని బ్రహ్మం గారు చెప్పారు.
అలానే ఇప్పుడు జరుగుతుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బంగారు తాబేలు గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు.
బంగారు కవచంతో ఓ తాబేలు నేపాల్లో జన్మించింది.నిజానికి నేపాల్ లో తాబేళ్లను దేవుడిగా పూజిస్తారు.
బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ చూడగానే బంగారు తాబేలనే అని అనుకునేలా మెరుస్తూ ఉంటుంది.
దీంతో బ్రహ్మం గారు చెప్పినట్టే బంగారు తాబేలు జన్మించిందని నెట్టింట్లో చర్చ జరుగుతుంది.
కానీ ఈ విషయాన్నీ వైద్యులు ఒప్పుకోవడం లేదు. జన్యు కారణాల వల్లే తాబేలు ఇలా పుట్టిందని అంటున్నారు.
భక్తులు మాత్రం ఈ తాబేలు ఓ దైవ సృష్టి అని చెప్తున్నారు.నేపాల్ తో పాటు భారత్ లోను తాబేలుకు పూజలు చేస్తారు.