బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేరు.రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు భారీగా పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తుంది.కాగా గత సంవత్సరం రూ.31 వేలు ఉన్న బంగారం ధర ఇప్పుడు 52 వేల మార్క్ దాటింది అంటేనే అర్థం చేసుకోవాలి.
కాగా బంగారం ధరలు ఇలా భారీగా పెరగడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారంపై డిమాండ్ పెరిగిందని అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
అయితే రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని, వెండి ధర కూడా ఇదే దారిలో నడవనుంది మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
మరో ఆరు నెలల్లో బంగారం ధర రూ.55 వేలకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.రూ.50 వేల వద్ద ఉన్న బంగారం ధర రూ.68 వేలకు చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.కాగా ప్రస్తుతం మన దేశంలో తులం బంగారం ధర రూ.52 వేల రూపాయిల వద్ద, కేజీ వెండి ధర రూ.62 వేల వద్ద ఉంది.ఏది ఏమైనా సంవత్సరం వ్యవధిలో 20 వేలు పెరగం రికార్డు అనే చెప్పాలి.