బంగారం ధరలు ఎంత దారుణంగా పెరిగాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కారణం కోవిడ్ అయినా మరేదైనా 2023, 2024 లో పెరగాల్సిన బంగారం ధరలు ఇప్పుడే పెరిగాయ్.
అలాంటి ఈ బంగారం ధరలు మొన్న ఆగస్ట్ వరకు భారీగా పెరిగాయ్.ఇప్పుడు మాత్రం రోజుకు వంద, రెండు వందలు తగ్గుతూ సామాన్యులకు ఊరటనిస్తోంది.
దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు పడుతూ లేస్తూ వస్తున్నాయ్.నిన్నటికి నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు అమాంతం పడిపోయింది.అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర ఏకంగా 1957 డాలర్లకు తగ్గిపోయింది.దీంతో భారత్ లో బంగారం ధరలు తగ్గిపోయాయి.నేడు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 65 రూపాయిలు తగ్గుదలతో రూ.49,170కు చేరింది.
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయిల తగ్గుదలతో 53,640 రూపాయిలకు చేరింది.ఇక వెండి ధర కుడి అలాగే కొనసాగుతుంది.కేజీ వెండి ధర 1299 రూపాయిల తగ్గుదలతో రూ.67,050లకు చేరింది.అయితే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో బంగారం ధర కేవలం నెల రోజుల్లోనే 5 వేల రూపాయిలు తగ్గింది.ముందున్న రోజుల్లో కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.