పెట్టి పుట్టాలే గానీ.తినే కంచం కూడా బంగారందే అవుతుంది అనడం ఒకప్పటి సామెత.
కానీ ఇప్పుడు బంగారంతోనే వంటకాలు చేసుకోవచ్చు అనేది కొత్త సామెత.ఎందుకంటే ఇవాళ రేపు ఇలాగే వంటలు చేస్తున్నారు చాలామంది.
అవును మరి.మనకు తెలియదు గానీ.
చాలా వరకు పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ఇలాంటి వంటలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.అయితే ఇలాంటి వంటకాలు తినేందుకు సాధారణ మధ్యతరగతి వారు గానీ.
లేదంటే అట్టడుగు వర్గం వారికి గానీ అవకాశం లేదు.కేవలం డబ్బున్న వారికి మాత్రమే ఇలాంటి వంటకాలు తినేందుకు ఛాన్స్ ఉంది.
మొన్నటికి మొన్న బంగారంతో తయారు చేసిన మండి బిర్యానీ గురించి విన్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి బంగారు పూతతో రెడీ చేసిన వంటకం గురించి తెలుసుకుందాం.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.దాని గురించి తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాంయ.
మనకు తెలిసినంత వరకు స్వీట్లంటే ఏదైనా పాల పదార్థంతో రెడీ చేస్తారు.కానీ బంగారంతో తయారు చేస్తారంటే నమ్మరు కదా.
కానీ ఇప్పుడు నిజంగానే బంగారు పూతతో రెడీ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఉండే మౌజ్ పూర్ ప్రాంతంలో బంగారు పూతతో స్వీట్లు రెడీ చేసే షాపు ఉంది.గోల్డ్ ఫాయిల్తో ఇక్కడ స్వీట్లను రెడీ చేస్తున్నారు.ఇక బంగారు పూత మీద కొంత కుంకుమ పువ్వును డెకరేట్ చేసి అందంగా రెడీ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వ్యూస్ సంపాదించుకుంటోంది.దీన్ని చూసిన వారంతా కూడా ఇలాంటి స్వీట్లను జీవితంలో ఒక్కసారైనా తినాలని కామెంట్లు పెడుతున్నారు.ఎందుకంటే ఇలాంటి స్వీట్లు తినడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు కదా.