చాలామంది జీవితాల్లో చిన్న చిన్న వస్తువులు ఎక్కడో ఓ చోట దొరికే ఉంటాయి.కొందరికైతే నక్కతోక తొక్కినట్టుగా ఊహించని పెద్ద వస్తువులు దొరుకుండొచ్చు.
మీ జీవితంలో ఎవరికో ఒకరికి ఇలాంటి ఘటనలు జరిగే ఉంటాయి.కొందరు దొరికిన వస్తువులను వాడుకుంటే, మరికొందరు పోలీసులకు అప్పజెప్పడం లాంటివి చేస్తారు.
ఎక్కడో ఓ చోట ఎవరికో ఒకరికి డబ్బుల విషయంలోనైనా మరియు ఇతర వస్తువులలైన దొరికే అవకాశం ఉంటుంది.
విలువైన వస్తువులు దొరకడంలో కూడా అదృష్టం ఉండాలి.
ఎవరికో ఒకరికి విలువైన వస్తువు దొరికితే తన అదృష్టం నక్క తోక తొక్కినట్టుగా ఉంటుందానుకుంటాం.కానీ ఇక్కడ ఒక్కరికి కాదు ఏకంగా ఒక ప్రాంతానికే అదృష్టం బంగారం రూపంలో కలిసొచ్చింది.
తమిళనాడు ప్రాంతంలో బంగారం కుప్పలు కుప్పలుగా దొరికాయి.
ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.
కృష్ణా జిల్లా కోసూరులో రోడ్డు పక్కల ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా ఉన్న బంగారం నాణాలు బయటపడ్డాయి.అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో జనాలందరికీ ఈ విషయం తెలియక బంగారం ఉన్న చోట హోరాహోరీగా తరలిపోయారు.
ఆ బంగారం విలువ 2గ్రాముల పై ఉన్నాయని తెలిసింది.దీంతో ఒకేసారి జనం అంతా బంగారం కోసం ఎగబడ్డారు.
అక్కడ మొత్తం బంగారం జాతర నే సృష్టించారు.
ఆ జనంతో రోడ్డు మొత్తం రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడగా… విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
కానీ అక్కడికి పోలీసులు చేరే సమయానికి బంగారు నాణేల జాడనే లేకపోయింది.అక్కడున్న జనమంతా ఎగిసిపడి బంగారు నాణెలను సొంతం చేసుకోగా పోలీసులకు ఒక్క నాణెం కూడా కనబడలేదు.
ఆ బంగారు నాణేలు అక్కడికి ఎలా వచ్చాయి అనేది మిస్టరీగా మారగా ఆ నాణేలపై అరబిక్ భాషలో అక్షరాలు ముద్రించి ఉన్నాయని తెలిపారు.