గోదావరి మళ్లీ ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది.
మహారాష్ట్ర, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది.ఈ క్రమంలో భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులు దాటింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.ఈ సాయంత్రానికి 55 అడుగులు దాటు అవకాశం ఉందని తెలిపారు.
ముంపు మండలాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలకు భద్రాచలం సహా పలు గ్రామాలు ముంపుకు గురైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే దుమ్ముగూడెం మండలంలో ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది.మరోవైపు ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో.డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.