మామూలుగా పిల్లలకు ఆకలి వేస్తే ఏం చేస్తారు చెప్పండి.మహా అయితే ఏడుస్తారు, అదే మాటలు వచ్చే చిన్నపిల్లలైతే తల్లిదండ్రులని ఆకలయితుంది అంటూ అడిగి మరి తెప్పించుకొని తింటారు.
ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ కాలంలో కొంతమంది చిన్న పిల్లలు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని తెగ వాడేస్తున్నారన్న సంగతి మనం గమనిస్తున్నాం.అందులోనూ ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యంలో ఎక్కువగా ఆన్లైన్ డెలివరీలంటూ ఆర్డర్ చేసి ఇంటికి తప్పించుకుంటూ ఉన్నాము.
ఇక అసలు విషయంలోకి వెళితే.
తాజాగా ఓ మూడు సంవత్సరాల అబ్బాయి తనకు ఆకలేస్తుందని ఏకంగా తన అమ్మ ఫోన్ తీసుకొని తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసాడు.
ఏకంగా ఓ కుటుంబమంతా ఎంత ఫుడ్ ను తినగలదో అంత ఆ మూడేళ్ల చిన్నారి ఆర్డర్ చేసింది.ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత ఆ ఫుడ్ చూసిన తర్వాత ఇంట్లో వారు ఆశ్చర్యపోయి చేసేదేమీ లేక చివరికి కుటుంబసభ్యులంతా కూర్చుని ఆ మీల్స్ ను తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదేదో సినిమా స్టోరీలా ఉంది అని అనుకుంటున్నారు కదా.కానే కాదండి నిజ జీవితంలో జరిగిన సంఘటన.
బ్రెజిల్ దేశానికి చెందిన ఓ మూడేళ్ల చిన్నారి ఏకంగా వంద డాలర్ల విలువ చేసే మ్యాసివ్ మ్యాక్ డొనాల్డ్ కు ఆర్డర్ ను చేసాడు.ఇందులో భాగంగానే పది ఫుడ్ బాక్స్ ను ఇంటికి డెలివరీ అయ్యాయి.అందులో 6 ప్రమోషనల్ మీల్స్, 8 స్పెషల్ ఆఫర్ టాయ్స్, 4 మిల్క్ షేక్స్, 6 హ్యాపీ మీల్స్, 8 నీళ్ల బాటిల్ ఆర్డర్ చేసింది.ఇలా ఆర్డర్ చేసిన ఫుడ్ నేరుగా ఇంటికి రావడంతో ఇంట్లోని వారు ఆ మీల్స్ చూసి షాక్ గురయ్యారు.
మొదటగా ఎవరు ఆర్డర్ చేశారో తెలియక తికమక పడిన తర్వాత ఆ అమ్మాయి తల్లి ఫోన్ చూస్తే అందులో నుంచి ఆర్డర్ వెళ్లినట్లు అర్థం అయింది.దీంతో చేసేదేమీ లేక వారి కుటుంబ సభ్యులు ఆ ఆహారాన్ని తినడం ప్రారంభించారు.
ప్రస్తుతం ఫుడ్ తింటున్న ఆ అబ్బాయి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఇందుకు కారణం లేకపోలేదు ఆ అమ్మాయి తల్లి తన ఫోన్ ను ఏదో ధ్యాసలో ఆ అబ్బాయి పక్కన పెట్టేసి వెళ్ళిపోయింది.
ఆ ఫోన్ ను ఓపెన్ చేసి మూడేళ్ల చిన్నారి ఇంత పెద్ద ఆర్డర్ ను ఆర్డర్ చేయడం చకచకా జరిగిపోయింది.