భారతదేశంలో కొన్ని రకాల జాతికి సంబంధించిన ఎద్దులు బాగా పేరుగాంచాయి.అలా బాగా పేరు పొందిన జాతికి చెందిన ఎద్దులను కొనడానికి కొంతమంది రైతులు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపుతారు.
మామూలుగా ఏ రకం జాతి ఎద్దుల అయినా సరే సరాసరిగా 50 వేల నుండి 4 లక్షల మధ్య ధరను పలకడం వింటూనే ఉంటాం.అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ రెండు ఎద్దులు ఏకంగా 17 లక్షల ధర పలికాయి.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట్ లో ఒక జత ఎద్దులు కళ్లుచెదిరే రేటుకి అమ్ముడయ్యాయి.కేవలం రెండు ఎద్దులు ఏకంగా 17 లక్షలకు అమ్మేసాడు ఓ రైతు.
కర్ణాటక రాష్ట్రంలోని మహా లింగాపూర్ పట్టణంలో ఉన్న నందా గావ్ లో సంగప్ప అనే రైతు 2018లో మల్లప్ప అనే వ్యక్తి దగ్గర నుండి ఒక జత ఎద్దులను కొనుగోలు చేశాడు.అప్పుడు వీటిని కొనడానికి సంగప్ప 8 లక్షల వరకు ఖర్చు చేశాడు.
వాటిని కొన్న మల్లప్ప ఆ ఎద్దులకు రామ్, లక్ష్మణ్ అని పేర్లను నామకరణం చేసి వాటిని ఎంతో అపురూపంగా పెంచుకున్నాడు.
అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడ ఎద్దుల పోటీలు జరిగినా వీటిని అక్కడికి తీసుకు వెళ్లి అక్కడ పోటీలలో పాల్గొనేవారు.
ఇలా పాల్గొన్న 48 పోటీలలో అన్ని చోట్ల కూడా మొదటి లేదా రెండు స్థానాలలో ఈ ఎద్దులు నిలిచాయి.ఇలా పోటీలలో గెలుచుకున్న మొత్తం 9 లక్షల రూపాయల వరకు ఉంది.
అలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఆ ఎద్దులను సంగప్ప ఎందుకో గాని మళ్ళీ అతను ఎవరి దగ్గర కోన్నాడు అతనికే ఏకంగా 17 లక్షల రూపాయలకు వాటిని విక్రయించాడు.దీంతో ఒక జత ఎద్దులు ఏకంగా 17 లక్షల రూపాయలు పలకడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.