స్వామి నిత్యానంద దేశవ్యాప్తంగా ఎంత పేరు ప్రఖ్యాతులు అయితే పొందాడో ఆ తర్వాత అదే స్థాయిలో వివాదాలను తన మీద వేసుకున్నాడు.బెంగళూరులోని బిడిది ధ్యాన పీఠాధిపతి గా ఎంతో పేరు ప్రఖ్యాతుకొద్దీ కాలంలోనే నిత్యానంద పొందారు.
ఆ తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ పీఠానికి రావడం మానేశారు.ఆయన గురించి ఆశ్రమంలో విచారిస్తే స్వామి నిత్యానంద ఉత్తర భారత పర్యటనకు వెళ్లారు అనే సమాధానం మాత్రమే వస్తోంది.
గుజరాత్లోని నిత్యానందకు మరో మఠం ఉండడంతో అక్కడికి వెళ్ళి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అహ్మదాబాద్లోని నిత్యానంద ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని ఓ తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇరువురికి విముక్తి కల్పించారు.
ఈ సందర్భంగా నిత్యానందపై పలు ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం నిత్యానంద ఆచూకీ లేకుండా పోవడంతో ముందస్తుగా ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసారు.
అయితే నకిలీ పాస్ పోర్ట్ ద్వారా నిత్యానంద ఆస్ట్రేలియాలోని ఓ ద్వీపానికి పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.