సాధారణంగా ఎవరైనా తల్లిదండ్రులు మృతి చెందితే వారి ఖననం పూర్తి అయిన తర్వాత వారి అస్తికలను సముద్రం లేదా నదుల్లో మనం చూస్తూనే ఉంటాం.తాజాగా అమెరికాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తండ్రి అస్థికలను బీరులో కలిపాడు.
అంతేకాకుండా ఆ అస్థికలు కలిపిన బీర్ ను పబ్ డ్రైనేజీ లో పడేశాడు.అది ఏంటి ఇలా అస్థికలను డ్రైనేజ్ లో పడేయడం ఏమిటా అని ఆలోచిస్తున్నారా అందులో ఎటువంటి తప్పు లేదు ఎందుకు అంటే అతని తండ్రి ఆఖరి కోరిక అదే అట.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని కావెంట్రీకి చెందిన ఓవెన్ అనే వ్యక్తి తండ్రి కెవిన్ మెక్ గ్లించే చనిపోతూ తన కొడుకును ఒక వింత కోరిక కోరాడు.తాను మృతి చెందిన అనంతరం తన అస్తికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్ పబ్ కు తీసుకొని వెళ్లి తన అస్థికలను బీర్ లో కలపాలని కోరాడు.
దీనితో కెవిన్ కు కొడుకు ఓవెన్, కూతురు కాస్సిడేలు ఇద్దరు కలిసి వెళ్లి బీరులో అస్థికలను కలిపి, అనంతరం ఆ బీర్ ను పబ్ ముందు ఉన్న ఒక డ్రైనేజీ లో పడేశారు.
ఈ సందర్భంగా కొడుకు ఓవెన్ మాట్లాడుతూ ఇలా చేయడం వింతగనే అనిపించవచ్చు.
కానీ, ఇది నా తండ్రి చివరి కోరిక ఎప్పటికీ ఇక్కడే ఉంటారు.నా తండ్రి ఎప్పుడూ తన అస్థికలను ఎపుడు పబ్ డ్రైనేజీ లోనే కలిపలని కోరేవాడని, అందుకోసమే ఇలా చేయాల్సి వచ్చిందని తెలియజేశాడు.
అంతేకాకుండా ఓపెన్ తండ్రి కెవిన్ చనిపోయిన అనంతరం తన తల వెంట్రుకలను కూడా పబ్ డ్రైనేజీ లోనే కలపాలని కోరాడు.దీనితో తండ్రి కోరుకున్న విధంగానే అతడి కొడుకు, కూతురు అస్తికలతో పాటు తలవెంట్రుకలను కూడా పబ్ డ్రైనేజీ లోనే కలిపేశారు.