గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తాజాగా హాస్పిటల్ లో మృతి చెందారు.బీజేపీ పార్టీకి చెందిన మనోహర్ పారికర్ గత కొంత కాలంగా క్లోమ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
అతని హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉన్నా కూడా, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు.ఇతని పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు కూడా చేసారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు సాయంత్రం ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారు.గత కొంత కాలంలో ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న అతను డాక్టర్స్ సహాయంతో వైద్యం తీసుకుతూ విధులు నిర్వహిస్తున్నారు.
తాజాగా గోవాలో హాస్పిటల్ లో ఆయన మృతి చెందారు.ఆయన మరణ వార్త తెలిసి వెంటనే ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.బీజేపీ పార్టీ ప్రముఖులు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కి చేరుకున్తున్నట్లు తెలుస్తుంది.