“మా” అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్రమాలు జరిగినట్లు.విష్ణు ప్యానల్ కి చెందిన మోహన్ బాబు నరేష్.
తమ ప్యానల్ సభ్యుల పై దాడులకు పాల్పడినట్లు.ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.మోహన్ బాబు, నరేష్ ఇద్దరూ కూడా పోలింగ్ రోజు భయానక వాతావరణం సృష్టించి రిగ్గింగ్ చేసినట్లు రౌడీయిజం తో.“మా” ఎన్నికలలో గెలిచినట్లు ఆరోపించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన రోజు సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ప్రకాష్ రాజ్.ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి లెటర్ రాయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సీసీ ఫుటేజ్ కావాలంటే కోర్టుకు వెళ్లండి… కోర్టు తీర్పును తాను పాటిస్తానని స్పష్టం చేశారు.ఎన్నికల ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు అనవసరం “మా” ఎన్నికలు సజావుగా.
జరిగేలా చూడటమే నా బాధ్యత.నా కర్తవ్యాన్ని ని సరిగ్గా నిర్వర్తించాను.
అని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని ప్రకాష్ రాజ్ కి సూచించారు.