ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యమంత్రిగా మరో నెలలో రెండు సంవత్సరాలు కాబోతున్న తరుణంలో.

 Go Od News For Dwakra Women In Ap, Good News For Dwakra Women In Ap Dwakra, Ys J-TeluguStop.com

ఇప్పటికే మేనిఫెస్టోలో 90 శాతానికి పైగా హామీలను జగన్ నెరవేర్చడం జరిగింది.కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉంటూ .సంక్షేమ పథకాలు అందిస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే మొన్న విద్యార్థులకు.

ఆ తర్వాత రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన జగన్ ప్రభుత్వం తాజాగా రాష్ట్ర డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త చెప్పింది.

మేటర్ లోకి వెళ్తే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళల ఖాతాలోకి రుణాల వడ్డీని జమ చేయనున్నారు.

దీని కోసం ప్రభుత్వం 1,109 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది.రాష్ట్రంలో మొత్తం  9.35 లక్షల డ్వాక్రా మహిళ గ్రూపులో .  1.02 కోట్ల మంది సభ్యులు ఉన్నారు.ఈ క్రమంలో నేరుగా మహిళల ఖాతాలోకి ఈ డబ్బు జమ చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయింది.

తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి సీఎం జగన్ చేతుల మీదగా కార్యక్రమం జరగనుంది. కాగా వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.246.15 కోట్ల రూపాయలను జమ చేయనుంది ప్రభుత్వం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube