ఓ రీచార్జ్ షాప్ క్కి వెళ్ళితే రీచార్జ్ కోసం మన నంబర్ ఇవ్వాల్సిందే.అక్కడ సిమ్ కార్డులు కూడా అమ్మకానికి ఉండి, మనకే అవసరం ఉంటే మన ఫోటోతో పాటు నంబర్ కూడా ఇవ్వాల్సిందే.
ఇప్పుడు ఈ పర్సనల్ వివరాలనే అమ్మకానికి వాడుకుంటున్నారు కొందరు చెడు మార్గపు వ్యాపారిదారులు.ఉత్తరప్రదేశ్ లోని కొన్ని మొబైల్ రీచార్జ్/ సిమ్ షాపుల్లో అమ్మాయిల నంబర్లు అమ్మకానికి పెడుతున్నారు.
అర్థం కాలేదా ?
షాపుకి అవసరానికి వచ్చిన అమ్మాయి ఎలాగో తన వివరాలు ఇస్తుంది కదా.ఆ వివరాల్ని ఆకతాయి అబ్బాయిలకు అమ్ముతున్నారు.ఒక ఫోన్ నంబర్ ఇవ్వాలంటే 50 రూపాయల నుంచి 500 రూపాయల వరకు చెల్లించాలి.నంబర్ రేటు అమ్మాయి ముఖాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు.అమ్మాయి ఎంత అందంగా ఉంటే, అంత ఎక్కువ రేటు.
ఈ షాపుల్లో అమ్మాయిల నంబర్లు సంపాదించిన ఆకతాయిలు, వారికి ఫోన్ చేయడం, హరాస్ చేయడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపడం చేస్తున్నారు.
వుమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1909 కి వచ్చిన కంప్లయింట్స్ మీద దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు, చివరకి ఈ మాఫియా గుట్టు రట్టు చేసారు.ఈ అమ్మకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఎందుకైనా మంచిది, మొబైల్ రీచార్జ్ కోసం కార్డులు వాడండి లేదంటే ఆన్లైన్ రీచార్జ్ చేసుకోండి.సిమ్ కార్డులు ఎక్కడపడితే అక్కడ కొనవద్దు.
అఫీషియల్ స్టోర్స్ లేదా తెలిసినవారి దగ్గర తీసుకోవడం మేలు.