ఇద్దరు మృగాళ్ల సామూహిక అత్యాచారం చేయడంతో పాటు చిత్రహింసలు పెట్టడంతో భరించలేకపోయింది ఆ మహిళ.ఆ నరకం కంటే చావే నయం అనుకుంది.
ఈ మృగాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకేసింది.ఈ ఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.
నేపాలికి చెందిన 23 ఏళ్ల మహిళను ఇద్దరు వ్యక్తులు కలిసి శుక్రవారం రాత్రి ఓ ఇంటికి తీసుకెళ్లారు.శుక్ర, శనివారం రెండు రోజుల పాటు ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.వారి ఆగడాలు, హింస భరించలేని ఆ మహిళ.మూడో అంతస్తు నుంచి శనివారం రాత్రి నగ్నంగా దూకేసింది.ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చారు.నిందితులను 19 ఏళ్ల లోకేష్ సైనీ, 24 ఏళ్ల కమల్ సైనీగా గుర్తించారు.
ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది…ప్రాథమిక దర్యాఫ్తు ప్రకారం ఆమె తనతో వచ్చిన ఇద్దరిలో ఒకరితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నదని, ఆ తర్వాత మరో వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయబోయాడని, ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరు కలిసి ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, దీంతో ఆమె బాల్కనీ నుంచి కిందకు దూకేసిందని తెలిపారు.