ఓ మేకను దొంగతనం చేయబోయిన వ్యక్తిని అడ్డుకున్నందుకు ఆ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు.ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిర్కా ప్రాంతంలోని ఆరావలి హిల్స్లో డిసెంబర్ 26న జరిగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.
ముగ్గురు బాలికలు కలిసి మేకలను మేపేందుకు ఆరావలి హిల్స్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.
ముగ్గురు అమ్మాయిలు వేర్వేరు చోట్ల తమ మేకలను మేపుతున్నారు.కాగా ఓ అమ్మాయి వద్దకు ఒక వ్యక్తి ఫూటుగా తాగివచ్చి మేకను దొంగలించేందుకు ప్రయత్నించాడు.
ఇది గమనించిన ఆ బాలిక ఆ వ్యక్తిని అడ్డుకుంది.దీంతో ఆ దుండగుడికి కోపం వచ్చి ఆ బాలికపై అత్యాచారం చేశాడు.
అటుపై ఆమెను చున్నీతో చెట్టుకు ఉరివేసి మేకను తస్కరించాడు.మిగతా ఇద్దరు బాలికలు తమ మేకలను తీసుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు.
మూడో బాలిక రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతికారు.బాలిక చెట్టుకు ఉరివేసుకున్న దృశ్యం వారి కంటపడింది.
దీంతో వారంతా పోలీసులను ఆశ్రయించగా, ఫీరోజ్పూర్ జిర్కా సీసీటీవీ ఫుటేజీల్లో ఓ వ్యక్తి మేకను పట్టుకుని వెళుతున్న దృశ్యాలు కనిపించడంతో కేసు నమోదు చేశారు.కాగా డిసెంబర్ 28న ఆ వ్యక్తిని ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు అతడిని రిమాండ్కు తరలించారు.