అమెరికాలో ఈ సంఘనట సంచలనం సృష్టించింది.ఓ 11 ఏళ్ల బాలిక న్యూజిలాండ్ ప్రధానికి ఐదు డాలర్లు లంచంగా పంపింది.
ఇంతకీ ఆ బాలిక ఎందుకు ప్రధానికి లంచం ఇచ్చింది అనే వివరాలలోకి వెళ్తే షాక్ తినక మానరు.న్యూజిలాండ్కు చెందిన విక్టోరియా అనే ఓ బాలికకి డ్రాగన్లు అంటే ఎంతో ఆసక్తి చూపుతుంది.
అంతేకాదు టైలికైనెటిక్ పవర్స్ ద్వారా డ్రాగన్లకు శిక్షకురాలిగా మారాలని భావించింది.అనుకున్నదే తడవుగా
టెలీ కైనెటిక్స్, డ్రాగన్లపై పరిశోధనలు చేయాలంటూ ఆ దేశ ప్రధానికి లేఖని రాసింది.
మీరు వీటిపై పరిశోధనలు జరపండి ఊరికే ఏమి వద్దు అంటూ ఏకంగా ప్రధానికే 5 న్యూజిలాండ్ డాలర్లను లంచంగా పంపింది.అయితే ఆ చిన్నారి లేఖకి స్పందించిన న్యూజిలాండ్ ప్రధాని ఆ బాలికకి తిరిగి లేఖని రాశారు.
ఫిజిక్స్, డ్రాగన్ల విషయంలో నీ సూచనలు ఆసక్తికరంగా ఉన్నాయి.కానీ
దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం ఈ విభాగంలో పరిశోధనలు చేయడం లేదు.అలాంటి అవకాశమే లేదు కాబట్టి నువ్వు లంచంగా ఇచ్చిన డబ్బును మళ్ళీ నీకు తిరిగి పంపుతున్నాను.టెలీకినెసిస్, టెలీపతి, డ్రాగన్ల అన్వేషణలో నీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నాను అంటూ లేఖలో పేర్కొన్నారు ప్రధాని.