ప్రేమిస్తున్నా అని అబ్బాయి చెప్పిన మాయమాటలను గుడ్డిగా నమ్మేసింది…పెళ్లి చేసుకుంటా అని చెప్పేసారికి మరింత దగ్గరయ్యింది .కానీ ఆ నమ్మకమె ఇప్పుడు అమ్మాయికి తీరని కష్టాలు తెచ్చిపెట్టింది!…నమ్మిన వాడు మోసం చేసి అబార్షన్ చేయించి దిక్కులేకుండా వదిలేసాడు!…అసలు కథ ఎంతో చూడండి!
శ్రీకాకుళం కి చెందిన ఒక కుటుంబం ఇటీవలే బతుకుతెరువు కోసం హైద్రాబాదుకి వచ్చింది…వారు కూలీ పని చేసుకునేవారు.
వాళ్ళకి ఒక అమ్మాయి (19)…ఇంటి ఆర్ధిక పరిస్థితి చూసి అండగా నిలబడాలి అని సూపర్ మార్కెట్ లో సేల్స్ గర్ల్ గా చేరింది…అదే సమయంలో కార్ డ్రైవర్ గా పని చేస్తున్న “శొభన్” తో పరిచయం పెరిగింది యువతికి.మాటలు కలిపి, కార్ లో తిప్పేవాడు.
అతను లేకుండా బతకలేను అనుకోని అమ్మాయి…తల్లితండ్రులను కాదని అతనితో వెళ్లిపోయింది…
అమ్మాయి కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లితండ్రులు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీస్ లు దర్యాప్తులో తల్లితండ్రులు భయపడినట్టుగానే ఓ చేదు నిజం వెలుగులోకి వచ్చింది!…ఉప్పల్ పోలీస్ ల కథనం ప్రకారం…యువతి మేజర్ అని తల్లితండ్రులని ఎదిరించి “శొభన్” తో వెళ్లిపోయింది…తీరా ఆ దుర్మార్గుడు అమ్మాయికి కడుపు చేశాడు.
పిల్లలని పెంచే ఆర్ధిక పరిస్తితి లేకపోవడంతో కోటి లోని ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడు…తరవాత ఇద్దరు బస్ ఎక్కి అమీర్పేట్ లో దిగారు…ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు…
అతని కోసం ఎదురు చూసిన యువతి…రక్తశ్రావం అవుతున్నా బల్కమ్పేట వరకు కాలినడకన వెళ్ళింది.అక్కడ స్పృహ కోల్పోయి పడిపోవడంతో TRS వార్డు సభ్యురాలు రాణి కాయార్ మరో మహిళతో కలిసి ఎస్.ఆర్.నగర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్సనందించారు.అమ్మాయి ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది.జరిగిన విషయం మొత్తం మీడియా కి చెప్పి కంట తడి పెట్టుకుంది!