అడవి జంతువులకు కోపం తెప్పిస్తే అవి చేసే పనులు ప్రాణాల మీదకు తెస్తాయి.ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక జంతువుల కోపానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే అనేకం వైరల్ అయ్యాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అదేంటో ఇప్పుడు చూద్దాం.సరదాగా అడవికి వెళ్లిన ముగ్గురు టూరిస్టులకు నీటి ఏనుగులు చుక్కలు చూపించాయి.
బోటులో ప్రయాణిస్తున్న వాళ్లను కాసేపు పరుగులు పెట్టించాయి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.బోటుతో సమానంగా.వారి వెంట పరుగెడుతూ భయాందోళనకు గురి చేశాయి.చివరకు బతుకు జీవుడా.అనుకుంటూ ఆ ముగ్గురు టూరిస్టులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ఘటన కెన్యాలో జరిగింది.ఆ ముగ్గురు టూరిస్టులు విక్టోరియా సరస్సులోకి సరదగా వెళ్లారు.అందులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి.వాటి కంట కనబడితే ఇక అంతే సంగతులు.
ఈ విషయాన్ని తెలిసి కూడా ఆ టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి వెళ్లారు.ఆ సరస్సులో స్పీడ్ బోటింగ్ చేస్తుండగా కొన్ని నీటి ఏనుగులు కనిపించాయి.
వాటి వీడియోలు, ఫొటోలు తీశారు.ఇంతలో ఓ నీటి ఏనుగు పెద్దగా అరుస్తూ బోటు వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది.దీంతో వెంటనే భయపడిపోయిన బోటు డ్రైవర్.రయ్ మంటూ స్పీడ్ పెంచుతూ ముందుకు పోనిచ్చాడు.అయినా వదలకుండా ఆ నీటి ఏనుగు వారిని స్పీడ్ గా వెంబడించింది.ఇదంతా అందులోని ఒకరు వీడియో తీశారు.
తృటిలో వారంతా తప్పించుకున్నారు.ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైర్గా మారింది.
వారంతా ఆ వీడియోలో భయంతో అరుపులు కేకలు పెడుతూ చివరకు ఒడ్డుకు చేరుకున్నారు.ఇది చూసిన నెటిజన్లు వేలల్లో కామెంట్లు పెడుతున్నారు.
ఇటువంటి సాహసాలు అవసరమా అంటూ సజేషన్స్ ఇస్తున్నారు.