ఏంటి భూమికి చిల్లు? ఆలా పడే అవకాశం ఉందా? అని మీకు ఆశ్చర్యం వెయ్యచ్చు.కానీ నిజంగానే ఆ ప్రమాదం జరిగేకి ఎంతో దూరం లేము అని అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇన్నాళ్లు వాతావరణ కాలుష్యం కారణంగా ఓజోన్ పొరకు చిల్లు పడుతుందని తెలుసు.కానీ భూమికి చిల్లు పడుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
ఇప్పటికే ప్రపంచం అంత చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా గజ గజ వణికిపోతుంది.అలాంటిది ఇప్పుడు ఏకంగా భూమికి భారీస్థాయిలో చిల్లు పడటం అనేది అందరిని అందులోనలోకి నెట్టేస్తుంది.
వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా భూమికి భారీగా నష్టం జరుగుతుందని అంటున్నారు కొందరు పరిశోధకులు.
సైబీరియాలోని యమల్ పెనిసులాలో భూమి మీద భారీ బిలం ఏర్పడింది.
ఇక దాన్ని రష్యాకు చెందిన జర్నలిస్టులు గుర్తించగా ఆ బిలం 164 అడుగుల వరకు లోతు ఉంటుందని అంచనా వేశారు.ఇక ఆ బిలాన్ని 2014లోనే గుర్తించగా మీథేన్ గ్యాస్ వల్ల పేలుడు ఏర్పడిందని గుర్తించారు.
ఇక ఈ బిలంపై పరిశోధకులు పరిశోధన చెయ్యగా దాన్ని హైడ్రోలాకోలిత్ అంటారని చెప్పారు.అంతేకాదు గతంలో ఆ బిలం ఉన్న ప్రదేశంలో భారీ శబ్దాలు, దట్టమైన పొగలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు.