కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీలో ప్రస్తుతం పనికిమాలిన నాయకులు ఉన్నారని విమర్శించారు.
ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధులకు తెలివి లేదన్నారు.పార్టీ తొలి రోజు నుంచి అండగా నిలిచిన తనలాంటి నేతలెవరో కూడా వారికి తెలియకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జీ23 తరపున పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన సమయంలో సరిగా నిద్రకూడా పోలేకపోయినట్లు వ్యాఖ్యనించారు.కాంగ్రెస్ కు రాజీనామా చేయడంపై స్పందించిన ఆయన.
తనను బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని వాపోయారు.