ఆర్మీ ఏరియాలో ఎవరైన ఏదైనా తప్పు చేస్తూ దొరికితే వారికి వేసే శిక్షలు ఆర్మీ రూల్స్ ప్రకారం ఉంటాయి.కానీ వారే తప్పు చేస్తూ కంటపడితే దాదాపుగా వీరిని ఎవరు ప్రశ్నించరు.
అందువల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వారి ఏరియాలో వారికి నచ్చినట్లుగా రోడ్లు మూసివేయడం లాంటి కొన్ని ఇబ్బందికర పరిస్దితులను సృష్టిస్తుంటారు.
ఇలా సికింద్రబాద్ కంటోన్మెంట్ రూట్లల్లో వెళ్లే ప్రజలు వీరి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ మల్కాజ్గిరి జిహెచ్ఎంసి సర్కిల్ మొదటి సారిగా ఓ ఆర్మీ స్కూల్ కు జరిమానా విధించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు, నాయకులు బిజీగా ఉండటం చూసి ఆర్మీ పాఠశాల అధికారులు ఆర్కెపురం ప్రధాన రహదారిని అనుమతులు లేకుండా ధ్వంసం చేశారని, అనుమతులు లేకుండా స్పీడ్ బ్రేకర్లు వేసి రోడ్డు డ్యామేజ్ ఆవడానికి కారణం అయ్యారని ఈ మేరకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది.ఇలా ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం చట్ట విరుద్దం కాబట్టి రోడ్డు దెబ్బ తిన్నందుకు 16.5 సెంటేజ్ చార్జీలు, 18 శాతం జీఎస్టీ చార్జీలు మొత్తం కలిపి 3 లక్షల వరకు చెల్లించాలని మల్కాజ్గిరి జిహెచ్ఎంసి సర్కిల్ తెలియచేసిందట.