జీహెచ్ఎంసీ నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ అంశంపై విచారణ మమ్మురంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బల్దియా చర్యలకు సిద్ధమైంది.
ఆర్డీవో ప్రొసీడింగ్స్ లేకుండా సర్టిఫికెట్ల జారీకి ఐటీ వైఫల్యమే కారణమని విజిలెన్స్ తేల్చింది.వెబ్ సైట్ ఆటోమేటిక్ అప్రూవల్ తో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో సాంకేతిక లోపాలను గుర్తించని అధికారులపై బల్దియా చర్యలకు తీసుకోనుంది.అదేవిధంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లపై కూడా బల్దియా కమిషనర్ వేటు వేయనున్నారని సమాచారం.