చిట్టీల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు.సుమారు రూ.2 కోట్లు మోసం చేసి పరారైయ్యాడు.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఇల్లందులో శంకరయ్య అనే వ్యక్తి స్థానికుల వద్ద నుంచి చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైయ్యాడు.విషయం తెలుసుకున్న బాధితులు శంకరయ్య భార్యను చెట్టుకు కట్టేశారు.
సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శంకరయ్య తప్పు చేస్తే భార్య, కూతురును ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పారు.అనంతరం ఆమెను విడిపించి, నిందితుడిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
దీంతో బాధితులు శాంతించారు.