కరోనా ఎంత భయంకరమైన వాతావరణం సృష్టించిందో అందరికి తెలిసిందే.దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవించారు.
ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నారు.తినడానికి తిండి లేక ఉపాధి కూడా కోల్పోయి రోడ్డు మీద పడ్డారు.
కరోనా నుండి మెల్లగా కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ రావడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది.
దీంతో ప్రభుత్వాలు కరోనా కు విరుగుడుగా వాక్సిన్ వేయించు కోవాలని ప్రజలకు చైతన్యం కలిగిస్తున్నారు.
ఈ వాక్సిన్ తయారు చేయడం కోసం శాస్త్రవేత్తలు చాలా శ్రమించారు.కరోనా వచ్చిన సంవత్సరం తర్వాత వాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
వాక్సిన్ వేయించు కోవడానికి ప్రజలు భయపడుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం తో పాటు సినీ ప్రముఖులు కూడా వాక్సినేషన్ పై అవగాహన కలిగించేందుకు చాలా కార్యక్రమాలు చేపట్టారు.
దాదాపు ప్రజలందరూ భయం వీడి వాక్సిన్ వేయించు కుంటున్నారు.కానీ కొంత మంది ప్రజలు ఇప్పటికి వాక్సిన్ అంటే భయపడుతున్నారు.వీళ్ళ భయం పోగొట్టి వాక్సిన్ వేయించేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు.తాజాగా తమిళనాడు లోని కరూర్ జిల్లాలో వాక్సిన్ పై వినూత్నంగా ప్రచారం చేస్తూ అక్కడి ప్రజలందరూ వాక్సిన్ వేయించుకునేలా చర్యలు చేపడుతున్నారు.
ఇంతకీ వాళ్ళు వాక్సిన్ వేయించడానికి ఏ పద్దతిని ఫాలో అవుతునంరో తెలుసా.అక్కడ ప్రభుత్వం వారం వారం మెగా వాక్సిన్ క్యాంపు నిర్వహిస్తున్నారు.రేపు వచ్చే ఆదివారం రోజు కూడా మెగా క్యాంపు నిర్వహించ బోతున్నారు.ఆ రోజు వాక్సిన్ వేయించుకున్న వారి పేర్లను లక్కీ డ్రా తీసి బహుమతులు కూడా అందించనున్నారు.
మొదటి బహుమతిగా వాషింగ్ మెషిన్, రెండవ బహుమతిగా గ్రైండర్, మూడవ బహుమతిగా మిక్సి ఇవ్వనున్నారు.అంతేకాదు నాలుగో బహుమతిగా 25 మందికి ప్రెషర్ కుక్కర్లు, స్పెషల్ బహుమతిగా 100 మందికి వంట పాత్రలు అందించ నున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలు కూడా మెగా క్యాంపులో పెద్ద ఎత్తున పాల్గొని వాక్సిన్ వేయించుకుని బహుమతులు అందుకోవాలని వేచిచూస్తున్నారు.