ఏంటి కామెడీగా ఉందా? అని అంటున్నారు కదా! కానీ నిజంగానే ఇలా చేస్తున్నారట.సాధారణంగా ఈ కాలం ప్రజలు చాలామంది ఉపయోగం కంటే కూడా క్రేజ్ కే ఎక్కువ ఆకర్షితులవుతారు.
ఇంకా అలానే సింహాల మలానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.అంత డిమాండ్ ఎందుకు ఏర్పడింది అంటే దాని వల్ల ఉపయోగం లేదు కానీ ఫ్రెండ్స్ ని ఆటపట్టించడానికి అంత డిమాండ్ ఏర్పడింది.
పూర్తి కథలోకి వెళ్తే.కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ముంచీలో గల క్రోనే సర్కస్ నష్టాల్లో కూరుకుపోయింది.
గత కొన్ని నెలలుగా ఎటువంటి ప్రదర్శనలు జరగలేదు.దీంతో అందులోని ఉద్యోగులు పస్తులు ఉంటున్నారు.
ఇంకా ఆ సమయంలో ఏం చెయ్యాలి అబ్బా అని ఉద్యోగి ఆలోచిస్తున్న సమయంలో ఓ ఉద్యోగి ”సింహం మలాన్ని అమ్ముకుందాం” అని జోక్ చేశాడు.
ఆ మాటను అతను కామెడీగా తీసుకున్నప్పటికి సర్కస్ నిర్వాహకులు మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నారు.
దీంతో వారు మలాన్ని సేకరించి ఓ బాటిల్ లో పెట్టారు.అనంతరం రండి బాబు రండి.
సింహం మలాన్ని కొనుగోలు చేసి మీ ప్రాణ స్నేహితులకు ఇవ్వండి అన్నారు అంతే చాలు క్రేజిగా ఉందే అంటూ అందరూ కొనడానికి వచ్చారు.తెచ్చిన మలం కొన్ని క్షణాల్లోనే అయిపొయింది.
ఒక్కో బాటిల్ మలాన్ని రూ.445 కు అమ్ముతున్నారు.ఆ సర్కస్ లో మొత్తం 26 సింహాలు, పులులు ఉన్నాయి.కొందరు దానిలో క్రిములు ఉంటాయని, విక్రయించడం ఆపాలని సర్కస్ వారికి ఫిర్యాదు చేసినప్పటికి వారు సర్కస్ ఆర్ధికంగా ఉండేందుకు, అందులో జంతువులకు తిండి పెట్టగలుగుతున్నాం అని వారు చెప్పారు.
కాగా దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయిన ప్రజలు వారి స్నేహితులను ఆటపట్టించేందుకు కొనుగోలు చేస్తున్నారు.మరి కొందరు వాటిని ఎరువుగా ఉపయోగిస్తున్నారు.