బాలయ్య కోసం ఆత్రేయ ప్లేస్‌లో జార్జిరెడ్డి

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందకు రెడీ అయ్యారు.ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించిన ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య-బోయపాటి కసిగా చూస్తున్నారు.

 George Reddy, Sandeep Madhav, Balakrishna, Boyapati Srinu, Naveen Polishetty-TeluguStop.com

గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక్ హీరో, డైరెక్టర్ ఇద్దరూ సతమతమవుతుండటంతో, ఈసారి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి తప్పులు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక బాలయ్యతో పాటు ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉంటారని తెలుస్తోంది.అయితే ఆ యంగ్ హీరో ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చలు సాగుతున్నాయి.

ఇప్పటికే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో మంచి గుర్తింపును తెచ్చుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలు రాగా, అవి కేవలం గాలి వార్తలే అని సదరు హీరో కొట్టిపారేశాడు.దీంతో ఇప్పుడు మరో యంగ్ హీరో పేరు తెరపైకి వచ్చింది.

‘జార్జి రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన యంగ్ హీరో సాయి మాధవ్ ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.జార్జిరెడ్డి సినిమాలో తన యాక్టింగ్‌తో మెప్పించిన సాయి మాధవ్ అయితే ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని బోయపాటి భావించాడట.

దీంతో అతడిని ఈ సినిమాలో తీసుకునేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.మరి బాలయ్య కోసం సాయి మాధవ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడో చూడాలి.

ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube