జ్యోతిలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో నటుడుగా ఎంట్రీ ఇచ్చి తరువాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వంగవీటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్.నటుడుగా వంగవీటి పాత్రలో ఒదిగిపోయి సందీప్ నటించి మెప్పించాడు.
ఈ సినిమా తర్వాత మరో బయోపిక్, ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన సినిమాలో టైటిల్ రోల్ పోషించి మరోసారి తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు.అయితే జార్జ్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ నెక్స్ట్ సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు.
చాలా వరకు అతని దగ్గరకి బయోపిక్ తరహా కథలతోనే దర్శకులు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితిలో కొంత గ్యాప్ తీసుకున్నాడు.అయితే చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాకి సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ సారి బయోపిక్ స్టోరీ కాకుండా పూర్తి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోకి వచ్చేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో హీరోగా తన మూడో సినిమా చేస్తున్నాడు.
మధు కిరణ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.హల్సియన్ మూవీ పతాకంపై సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ సూరపనేని ఈ సినిమా నిర్మించనున్నారు.
ఇప్పటి వరకు నటుడుగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సందీప్ ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువ అవుతాడని చిత్ర యూనిట్ పేర్కొంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
డిసెంబర్ లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.