తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ఇప్పటికే ఈ ఛాలెంజ్ కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు భార్య అయినటువంటి అక్కినేని అమల పాల్గొని ఆమె నివాసం ఉంటున్న ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి మెగాస్టార్ కోడలు ఉపాసన కి చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా జార్జిరెడ్డి హీరో సందీప్ మాధవ్ కి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే ఈ చాలెంజ్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హీరో సందీప్ యాదవ్ హైదరాబాదులోని మోతీ నగర్ ప్రాంతంలో ఉన్నప్పుడు పార్కులో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తో కలిసి ఇ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా సందీప్ మాధవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సందీప్ మాతో మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను చూస్తుంటే వాయు కాలుష్యం రోజురోజుకూ ఎక్కువ అవుతుందని దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు.
అంతేగాక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.
అనంతరం ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ను “బ్యూటిఫుల్” చిత్ర హీరోయిన్ నైనా గంగూలీ, జార్జి రెడ్డి చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి, నటుడు శత్రువు, మరియు జార్జిరెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించినటువంటి కథానాయిక ముస్ఖాన్ చాందినికి ఈ చాలెంజ్ విసిరారు.
.