టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ జెనీలియా.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఇక ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ ఒక పుకారు కూడా ఎదుర్కోలేదు.కానీ గతంలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
హిందీ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.అదే ఏడాది తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది.ఇక సత్యం సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాగా ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇచ్చింది.ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాలో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో వరుసగా నా అల్లుడు, హ్యాపీ, బొమ్మరిల్లు, శశిరేఖ పరిణయం, రామ్ వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత హిందీలో కూడా పలు సినిమాలలో నటించింది.
టాలీవుడ్ లో 2012లో నా ఇష్టం సినిమాలో చివరిసారిగా నటించగా అక్కడి నుంచి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.ఇక అక్కడే ఉంటూ మరో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే గతంలో పెళ్లికి ముందే తన భర్తతో ఓ రాత్రి సమయంలో గడిపింది.
అప్పట్లో రితేష్ దేశముఖ్ తండ్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు.ఆ సమయంలోనే జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ మధ్య ప్రేమ చిగురించింది.ఈ విషయం ఇండస్ట్రీలో తెలియగా మీడియా ముందు బయటపడకుండా రితేష్ తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు.ఎందుకంటే రితేష్ తండ్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఇటువంటి లవ్ ఎఫైర్ గురించి మీడియా ముందు పడితే తమ హోదాకు ఏమైనా అవుతుందేమో అని వారి మధ్య దూరం పెంచారు.
అయినా కూడా వీరిద్దరు రహస్యంగా కలుసుకున్నారు.గత కొన్ని ఏళ్ళ కిందట ముంబైలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ఓ పార్టీ ఇవ్వగా అందులో జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ కూడా హాజరయ్యారు.
ముందుగా ఆ పార్టీకి రితేష్ రాగా కొద్దిసేపటికి జెనీలియా వచ్చింది.వీరిద్దరూ పార్టీ ముగిసేంత వరకు ఒకరినొకరు వదులుకోకుండా ఉన్నారు.
ఆ పార్టీలో ఎక్కడికి వెళ్ళినా వీరి జంటనే బాగా హైలెట్ గా నిలిచింది.పైగా ఇండస్ట్రీలో మొత్తం ఈ జంట గురించే తెగ మాట్లాడుకున్నారు.
అలా వారి మధ్య ప్రేమ మరింత బలంగా మారడంతో వీరు తమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇక అప్పటినుంచి ఈ జంట బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది.ఇప్పటికీ ఎన్నో జంటలు పెళ్లి చేసుకోని విడిపోయిన కూడా ఈ జంట మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఇక రితేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యింది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట బాగా యాక్టివ్ గా కనిపిస్తుంటారు.వాళ్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటారు.
ఇదిలా ఉంటే జెనీలియా త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.