తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన జెనీలియా చాలా రోజుల తర్వాత ముఖానికి రంగేసుకుంది.రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లాడిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న జెనీలియా చాలా గ్యాప్ తర్వాత వేద్ అనే సినిమా చేసింది.
ఈ సినిమాలో హీరోగా రితేష్ నటించగా సినిమాను డైరెక్ట్ చేసింది కూడా అతనే అవడం విశేషం.తెలుగులో హిట్టైన మజిలీ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా ఈ మూవీ వచ్చింది.
నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా రీమేక్ గా వచ్చిన వేద్ కూడా మరాఠిలో తెరకెక్కించగా అక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది.
అక్కడ ఈ సినిమాకు సూపర్ వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తుంది.జెనిలియా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాను తెగ చూసేస్తున్నారట.డైరెక్టర్ గా రితేష్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుందని తెలుస్తుంది.
ఇక గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెర మీదకు వస్తుంది జెనిలియా.