టాలీవుడ్లో దశాబ్దకాలం క్రితం సందడి చేసిన హీరోయిన్ జెనీలియా.ఈ అమ్మడు రితేష్ దేశ్ముఖ్ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా మళ్లీ హీరోయిన్గా నటించేందుకు ఆసక్తి చూపుతుందట.ఆమె భర్త కూడా అందుకు సహకరించడంతో పాటు ఆమెను ప్రోత్సహిస్తున్నాడట.
జెనీలియా మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం సాధ్యమేనా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమెను హీరోయిన్గా ఎవరు ఒప్పుకోరు.
ఇదే సమయంలో ఆమె అక్క, అత్త అమ్మ పాత్రలకు సెట్ కాకపోవచ్చు అంటున్నారు.ఆమె చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేనా లేదా అనే విషయం పక్కన పెడితే తెలుగులో ఆమెను ఇప్పటికి చాలా మంది అభిమానిస్తూ ఉన్నారు.
తెలుగులో ఏ డైరెక్టర్ ఈమెను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో అనేది అందరికి ఆసక్తికరంగా మారింది.
జెనీలియా మాత్రం సోషల్ మీడియా ద్వారా తన రీ ఎంట్రీ విషయమై చాలా ప్రయత్నాలు చేస్తోంది.తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేయడంతో పాటు కథలు వింటున్నట్లుగా చెప్పకనే చెప్పింది.మొత్తానికి ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
తెలుగు ప్రేక్షకులు మాత్రం ఇంకా హాసినిని కోరుతున్నారు.ఆమె ఒకటి రెండు సినిమాల్లో అయినా నటించాలని ఆశ పడుతున్నారు.