టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి జెనీలియా.ఈ అమ్మడుకి అవకాశాలు భాగా ఉన్న సమయంలోనే కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.
మళ్ళీ ఏడేళ్ళ తర్వాత్ ఈ భామ తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.అది కూడా తనకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.
అందుకోసం టాలీవుడ్ దర్శక, నిర్మాతలని కూడా సంప్రదిస్తుంది.అయితే ఇక ఆమె ప్రయత్నం చేస్తూ ఉండగానే ఇప్పుడు ఊహించని విధంగా ఓ అద్భుతమైన అవకాశం ఆమెకి వచ్చినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మలయాళీ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు.సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు సుజిత్ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇందులో విలన్ గా ఇప్పటికే జగపతిబాబుని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక మరో కీలక పాత్ర కోసం జెనీలియాని సంప్రదించినట్లు సమాచారం.ఇందులో ముఖ్యమంత్రి కుమార్తె పాత్రలో జెనీలియా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించడం జరిగిందని, ఆమె కూడా మెగాస్టార్ సినిమా కావడంతో చేయడానికి వెంటనే ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.