బాయ్స్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ తెలుగులో సత్యం సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా తెలుగులో వరుసగా సినిమాలు చేసిన ముద్దుగుమ్మ జెనీలియా.ఈ అమ్మడు కెరియర్ లో బొమ్మరిల్లు సినిమా ఇప్పటికి ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది.
అందులో హాసిని పాత్రలో జెనీలియా చేసిన అల్లరి పిల్ల యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.తరువాత ఆరెంజ్ సినిమాలో కూడా ఇంచు మించు అలాంటి పాత్రతోనే మెప్పించింది.
అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.తరువాత కొన్ని కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేసిన ఈ అమ్మడు తాను ప్రేమించిన బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది.
అయితే పెళ్లి అయ్యి ఎనిమిదేళ్ళ తర్వాత మరల జెనీలియా ఇప్పుడు సినిమాలపై దృష్టి సారించింది.
ఇప్పటికే మంచి పాత్రలు అయితే నటించడానికి ఒకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక తనకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందించిన తెలుగు సినిమాలపైనే రీఎంట్రీలో కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో తాజాగా ప్రభాస్ పాటకు డ్యాన్స్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది.
బాహుబలి ది బిగినింగ్ చిత్రంలోని మనోహరి అనే పాటకు ఇసుకలో డ్యాన్స్ చేసి ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చెయ్యాలి అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది.
దీంతో ఈ అమ్మడు రీ ఎంట్రీకి ప్రభాస్ ని ఎంచుకుంది అనే టాక్ వినిపిస్తుంది.అయితే పాత హీరోయిన్స్ ని ఎక్కువగా తల్లి పాత్రలకి మాత్రమే తెలుగులో తీసుకుంటున్నారు.
మరి ఈమెని కూడా అలాంటి పాత్రల్లోనే తీసుకుంటారా లేక ఏదైనా మంచి పాత్ర ఇస్తారా అనేది చూడాలి.