మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో తెలివిగా కెరీర్ ను మరింత ముందుకు తీసుకు వెళ్లడం కోసం వెబ్ సిరీస్ లను ఎంపిక చేసుకుంది.వెబ్ సిరీస్ ల్లో వరుసగా నటించడం ద్వారా మరికొంత కాలం ఇండస్ట్రీలో ఉండవచ్చు అనేది ఆమె అభిప్రాయం.
వెబ్ సిరీస్ ల్లో నటించిన తమన్నా మెల్లగా షో లు కూడా చేయడం మొదలు పెట్టింది.జెమిని టీవీలో తమన్నా హోస్ట్ గా మాస్టర్ ఛెఫ్ షో ప్రారంభం అయ్యింది.
ఈ షో ప్రారంభం అయ్యి అయిదు ఆరు వారాలు అయ్యింది.షో కు వచ్చిన రేటింగ్ అత్యంత దారుణంగా ఉంది.
తమన్నా ఎంతగా చూపించినా.ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం మరియు ఫలితం అనేది లేకుండా పోయింది.
అందుకే జెమిని టీవీ వారు షో నుండి తమన్నాను పీకేశారు అనేది టాక్ వినిపిస్తుంది.ఆమె పారితోషికం కు వస్తున్న ఆదాయంకు సంబంధం లేకుండా ఉందని అందుకే ఆమెను తొలగించారనే వార్తలు వస్తున్నాయి.
ఒక వేళ వారే కనుక తొలగిస్తే తమన్నా కి ఖచ్చితంగా అవమానం అనే చెప్పుకోవాలి.
తమన్నా వంటి స్టార్ హీరోయిన్ బుల్లి తెర షో చేయడం మంచి విషయం.
ఆమె పారితోషికం ఎక్కువ అయినా కూడా ఆమెను తప్పించే అవకాశం ఉండదు.షో ను మద్యలో ఆపకూడదు కనుక ఆమెనే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది.
కాని తమన్నా ను తప్పించి షో ను కంటిన్యూ చేయడం కోసం ముద్దుగుమ్మ జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయను తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ షో కు సంబంధించిన రేటింగ్ ఘోరంగా ఉండటం వల్ల ఆమె తప్పుకుంది అనేది కొందరి వాదన.ఏం జరిగిందో జెమిని వారికి తెలియాలి లేదంటే తమన్నాకు తెలియాలి.ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కాని అసలు మ్యాటర్ ఏంటీ అనేది క్లారిటీ రాదు.
పెద్ద పెద్ద స్టార్స్ హోస్టింగ్ చేస్తున్న షో లు మంచి రేటింగ్ రావడం లేదు.అయినా కూడా వారే కంటిన్యూ అవుతున్నారు.కాని ఈ షో కు మాత్రం తమన్నాను మద్యలో తొలగించడం చర్చనీయాంశంగా మారింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.