తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగు బుల్లి తెర సెన్షేషనల్ షో అయిన బిగ్ బాస్ ను ప్రేక్షకులు ఎంతగా ఆధరిస్తున్నారో గత నాలుగు సీజన్ లకు వచ్చిన ఆదాయం మరియు రేటింగ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
నాల్గవ సీజన్ కరోనా వల్ల ఆలస్యం అయ్యింది.అందుకే ఈమద్య బిగ్ బాస్ ముగిసిందని అనిపిస్తుంది.
మామూలుగా అయితే జూన్ లేదా జులైలోనే షో ను ప్రారంభించాలి.ఈసారి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
కాని ఈసారి బిగ్ బాస్ షో కు జెమిని టీవీలో ప్రసారం కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం కు కాస్త లింక్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.జెమిని మరియు స్టార్ మా ఛానెల్స్ వారు ఇప్పటికే ఒక ఒప్పందంకు వచ్చారట.
దాన్ని బట్టి ఈ రెండు షో లు ఒకే సమయంలో రాకూడదు అది కూడా సీజన్ సీజన్ కు మద్య కనీసం గ్యాప్ ఉండాలి అనేది ఒప్పందం.
బుల్లి తెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ 1 ను మే చివరి నుండి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
కనుక కనీసం రెండున్న రెలలు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.అంటే ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ 1 పూర్తి అయ్యే వరకు బిగ్ బాస్ పట్టాలెక్కించే వీలు లేదు.
అందుకే బిగ్ బాస్ సీజన్ 5 ను జులై చివరి నుండి లేదా ఆగస్టులో మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.ఎవరు మీలో కోటీశ్వరులు షో కు బిగ్ బాస్ సీజన్ 5 కు కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు షో లు కూడా బుల్లి తెరపై సెన్షేషనల్ రేటింగ్ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.