నాగార్జున హోస్ట్ గా స్టార్ట్ అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఎంతటి ప్రజాదారణ సొంతం చేసుకుందో అందరికి తెలిసిందే.హిందీలో అమితాబచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి బేస్ చేసుకొని ఈ షోని తెలుగులో స్టార్ట్ చేశారు.
కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ ఈ షోకి వివిధ సీజన్స్ లో హోస్ట్ చేశారు.చిరంజీవితో చేసిన సీజన్ కి అనుకున్న స్థాయిలో రేటింగ్స్ రాలేదనే టాక్ ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షో కాస్తా పేరు మార్చుకొని ఎవరు మీలో కోటీశ్వరుడు టైటిల్ తో ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభం కావడానికి రెడీ అవుతుంది.దీనికి సంబందించిన ప్రోమోని మార్చిలో రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
త్వరలో ఈ షో స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు.
అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది.అయితే ఈ సీజన్ ని పూర్తిగా రద్దు చేసారని ప్రచారంలోకి వచ్చింది.దీనిపై స్టార్ మా నుంచి కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు ఆగిపోయినట్లే అని అందరూ భావించారు.
అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఈ షోకి సంబంధించి ఒక కొత్త ప్రోమో రిలీజ్ చేశారు.ఎవరు మీలో కోటీశ్వరుడు ఆడుగుతున్న వారి కలలని నిజం చేస్తుంది.
అందరికి కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది అని ప్రోమో రిలీజ్ చేసి దీనిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మాత్రం ప్రోమోలో చెప్పలేదు.