గత కొద్దిరోజుల క్రితం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ చిత్రాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.పోర్నోగ్రఫీ చిత్రాలను తీసి వాటిని పలు యాప్స్ లో అప్లోడ్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు అంటూ ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసి రెండు నెలలపాటు కస్టడీలో ఉంచారు.
తాజాగా బెయిల్ మీద రాజ్ కుంద్రా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కుంద్రాతో బ్లూ ఫిలిమ్స్ తో తనకు సంబంధం ఉందంటూ నటి గెహనా వశిష్ట్ ను పోలీసులు అరెస్టు చేసి 133 రోజులు ఆమెను కస్టడీలో ఉంచారు.
తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చిన గెహనా శిల్పా దంపతులకు మద్దతు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిత్యం వార్తల్లో ఉండటం కోసం మీడియా దృష్టిని తనవైపు ఆకర్షించడం కోసం నటి షెర్లిన్ చోప్రా, శిల్పా శెట్టి దంపతుల పరువు తీసేలా మాట్లాడుతుందని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో గెహనా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసలు రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ చిత్రాలు తీయడం కోసం ప్రోత్సహించింది నటి షెర్లిన్ చోప్రా అని ఈ సందర్భంగా గేహానా తెలియజేశారు.కుంద్రా జైలుకు వెళ్లడానికి కారణం తానేనన్న విషయాన్ని మర్చిపోయిన షెర్లిన్ ప్రస్తుతం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోందని తెలియజేసింది.
కుంద్రా క్రియేట్ చేసిన ఆర్మ్స్ప్రైమ్ యాప్ ద్వార కోట్ల రూపాయలను సంపాదిస్తూ ఈ స్థాయికి వచ్చిన ఈమె తనకు ఎంతో రుణపడి ఉండగా తన వల్లే కుంద్రా జైలు పాలయ్యాడనీ ఈ సందర్భంగా తెలియజేశారు.నిజం చెప్పాలంటే షెర్లిన్ 2012 సంవత్సరం నుంచి బోల్డ్ కంటెంట్ క్రియేట్ చేసిందని ఇంటర్వ్యూ సందర్భంగా షెర్లిన్ చోప్రా బాగోతం బయటపెట్టారు.
అయితే పోర్నో గ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాను 50 వేల రూపాయల జరిమానాతో పాటు అతని పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకొని అతనికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అతనితో సంబంధాలున్నాయని అరెస్ట్ అయిన గెహానా కూడా కండిషనల్ బెయిల్ పై విడుదలయ్యారు.మొత్తానికి షెర్లిన్ చోప్రా గురించి నటి గేహాన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు