ఈ మధ్య కాలంలో ఆడ, ఆడ, మగ, మగ మధ్య రిలేషన్స్ సర్వసాధారణం అయ్యిపోయాయి.ఇక సుప్రీం కోర్టు కూడా ఇలాంటి రిలేషన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చాలా మంది నేరుగా సమాజంలోకి వచ్చి తమ జెండర్ స్టేటస్ ని చెప్పుకుంటున్నారు.
అలాగే తాము ఎవరితో రిలేషన్ లో ఉన్నదీ కూడా ధైర్యంగా చెబుతున్నారు.ఇక ఇలాంటి గే రిలేషన్స్ బయటి రాష్ట్రాలలో ఎక్కువగా చూసేవాళ్ళం తాజాగా మన తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.
తెలంగాణలో సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడుకి అదే ప్రాంతానికి చెందిన గుండ్లగాని సాయితో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమగా మారింది దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
దీనిపై కొద్దిరోజులుగా వీరు చర్చించుకుంటున్న క్రమంలో సాయి ఓ షరతు పెట్టాడు.అమ్మాయిగా మారితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జానయ్య అంగీకరించాడు.లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారి తన ప్రేమికుడు కోసం తిరిగొచ్చాడు.సాయికి ఫోన్ చేసి పెళ్లి ఎప్పుడు చేసుకుందామని జానయ్య అడిగాడు.
దానికి సాయి తిరస్కరించాడు.నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు.
అబ్బాయిగా ఉన్న నీవు లింగ మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటా అని తెగేసి చెప్పేసాడు.దీంతో అమ్మాయిగా మారిన జానయ్య ఏం చేయాలో అర్ధం కాక పోలీసులని ఆశ్రయించాడు.
ఇప్పుడు ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.