దర్శకుడు గౌతమ్ మీనన్ గురించి, ఆయన సినిమాల గురించి మనందరికీ తెలిసిందే.గౌతమ్ మీనన్ తెరకెక్కించే లవ్ స్టోరీ లు తెరపై ఏ విధంగా ఉంటాయి మనందరికీ తెలిసిందే.
ఇతను తెరకెక్కించె లవ్ స్టోరీ తెరపై చూడటానికి ఎంతో అందంగా కూడా ఉంటుంది.కాగా గౌతమ్ ఇప్పటికే ఎన్నో ప్రేమ కథలను రూపొందించిన విషయం తెలిసిందే.
ప్రేమ కథలతో పాటు యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేసినప్పటికీ వాటిలో కూడా గౌతమ్ తన మార్క్ అయిన లవ్ స్టోరీ తప్పనిసరిగా ఉంటుంది.గౌతమ్ తెరకెక్కించే సినిమాలలో రొమాన్స్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పవచ్చు.రొమాన్స్ ని తెరపై ఎంతో అందంగా మలచడంలో గౌతమ్ మీనన్ ప్రత్యేకత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో మాధవన్ నుంచి నాగచైతన్య వరకు ప్రతి ఒక్కరికి లవర్ బాయ్ ఇమేజ్ లు రావడానికి కారణం గౌతమ్ మీనన్ సినిమాలే అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే గౌతమ్ మీనన్ రాజా సినిమాలో రొమాన్స్ విషయంలో హద్దు మీరుతున్నారా? అదేవిధంగా రొమాన్స్ ని అందంగా మలిచే విషయంలో బోర్డర్ దాటుతున్నారా అంటే అవుననే కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారాలు కొనసాగుతున్నాయి.కాగా ప్రస్తుతం శంభో హీరోగా గౌతమ్ మీనన్ వెందు తనియందు కాదు సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో సిద్ది ఇద్నానీ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ముగిసింది.ఇందులో సిద్ది ఇద్నానీ పావై అనే పాత్రలో నటిస్తోంది.అయితే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు డిమాండ్ చేసే సరికి గౌతమ్ మీనన్ తన ఫరిది దాటి ఆ సన్నివేశాలు షూట్ చేసినట్లు కోలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో పెదవి ముద్దు సన్నివేశాలు అలాగే కొన్ని బెడ్ రూమ్ ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.అయితే వాటి చిత్రీకరణ కేవలం నలుగురు మధ్య ఓ డార్క్ రూమ్ బ్లూలైట్ లో షూట్ చేసారట.
ఈ సన్నివేశాలు తెరపై ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లిపోయేవి కాదని సన్నివేశం డిమాండ్ చేయడంతో వాటిని రక్తికట్టించుకోడం కోసం థియేటర్లో అదే తీరున హైలైట్ చేయబోతున్నట్లు సమాచారం.