సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా గుర్తింపు దక్కించుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల ఓటీటీ కంటెంట్పై దృష్టి పెడుతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే జయలలిత బయోపిక్ క్వీన్ను తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం క్వీన్ సీజన్ 2 ను రూపొందించే పనిలో ఉన్నాడు.
క్వీన్ 2 తెరకెక్కిస్తూనే మరో వైపు ప్రముఖ ఓటీటీ అమెజాన్ కోసం ఒక వెబ్ సిరీస్ను రూపొందించేందుకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.
తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కోవిడ్ పై ఒక డాక్యుమెంటరీ లేదా వెబ్ సిరీస్ను గౌతమ్ వాసు దేవ్ మీనన్ రూపొందించబోతున్నాడు.
అది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతుంది.ఇందుకు గాను భారీ ఎత్తున అమెజాన్ వారు గౌతమ్ మీనన్కు పారితోషికంగా ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఆయన వరుసగా ఓటీటీ కంటెంట్పై దృష్టి పెడుతున్నాడు.
మరో వైపు సినిమాలను కూడా లైన్లో పెడుతున్నాడు.మొత్తానికి తనకున్న క్రేజ్తో ఓటీటీ ప్లాట్ ప్లామ్పై కంటెంట్ క్రియేట్ చేయడంతో పాటు కొత్త సినిమాలకు కమిట్ అవుతూ గౌతమ్ వాసు దేవ్ మీనన్ సౌత్లోనే బిజీ దర్శకుడిగా ఉన్నాడు.నిర్మాతగా కూడా గౌతమ్ మీనన్ సినిమాలు చేస్తూ ఉన్నాడు.
తెలుగులో గౌతమ్ మీనన్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆయన వెబ్ సిరీస్లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది.